- శనిలా దాపురించిన కో ఆర్డినేటర్ రాంబాబు..
- రాంబాబు పేరుచెబితేనే బాబోయ్ అంటున్న శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్స్..
- నకిలీ ఫింగర్ ప్రింట్స్తో హాజరు వేసి జీతం కాజేయసి.. ఎస్ఎఫ్ఐలు రాంబాబుకు చెల్లించే పరిస్థితి.
- ఎదురుతిరిగి అడిగితే.. బెదిరింపు పర్వానికి దిగడం..
- తమకు న్యాయం చేయాలని ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్న వైనం..
అక్రమాలు ఎక్కడ వుంటాయని గూగుల్లో వెదికితే.. టక్కుమని జీ.హెచ్.ఎం.సి. అని జవాబిస్తుంది గూగుల్.. కింది స్థాయి ఉద్యోగులను ఎవరు ఎక్కువుగా టార్చర్ పెడతారు అని ఎవరిని అడిగినా చెప్పేమాట ఒకటే జీ.హెచ్.ఎం.సి. లోని కొందరు అధికారులు అని సమాధానం చెప్పేస్తారు తడుముకోకుండా.. మహానగరం అని పేరుతెచ్చుకున్న హైదరాబాద్లో ఉన్నత స్థానంలో ఒక్కటిగా వెలిగిపోతున్న జీ.హెచ్.ఎం.సి. ఇప్పుడు లెక్కలేని అపవాదులు కూడగట్టుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్గా కాకుండా గబ్బుపట్టి పోయి హైదరాబాద్ నే మసకబారిన సెంటర్గా మార్చేస్తున్న కొందరు అవినీతి అధికారులు,వారి చేతుల్లో చిక్కి కుంచించుకుని పోతోంది జిహెచ్ఎంసి .. ముఖ్యంగా గోషామహల్ సర్కిల్ 14లో శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కోఆర్డినేటర్ రాంబాబు అక్రమ వసూళ్లకు తెగబడి శానిటేషన్ సిబ్బందికి ఇబ్బంది గురి చేస్తున్నాడనే వార్తలతో జీ.హెచ్.ఎం.సి. ఉన్నత అధికారులు సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు రేపటి కథనంలో మీ ముందుకు తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ’ .. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం’..