Monday, May 6, 2024

రేపే జీ.హెచ్.ఎం.సి. పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ..

తప్పక చదవండి
  • అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు..
  • మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా, మల్లారెడ్డి, మహమూద్ ఆలీ,
    శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుల
    చేతులమీదుగా వివిధ నియోజక వర్గాల పరిధిలో ఇండ్ల పంపిణీ..

హైదరాబాద్ : తెలంగాణలోని పేదల నీడ కోసం రూపొందించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కల నెరవేరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో భాగంగా నిర్మాణం అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రేపు లబ్దిదారులకు అందించనున్నారు. జిహెచ్ఎంసి పరిధిలోని 24 నియోజకవర్గాల్లో రేపు దాదాపు 11,700 మంది లబ్దిదారులకు డిగ్నిటీ డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 డిగ్నిటీ డబుల్ బెడ్ రూం ఇళ్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీన జిహెచ్ఎంసి పరిధిలో 9 లొకేషన్లలో రాష్ట్ర మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్ ఆయా నియోజకవర్గంలో ఎంపిక చేసిన 11,700 మందికి డబుల్ బెడ్ రూం ఇళ్ల డిగ్నిటీ కాలనీ లాటరీ ద్వారా కేటాయింపు చేస్తారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని బహదూర్ పల్లిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో గాజుల రామారం, బహదూర్ పల్లి, డి-పోచంపల్లి మొత్తం 1700 గృహాలు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అందులో గాజులరామారంలో నిర్మించిన 144 ఇళ్లను బహదూర్ పల్లి లో నిర్మించిన 356 గృహాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 500 మందికి పంపిణీ చేస్తారు. డి-పోచంపల్లి లో నిర్మించిన 1200 గృహాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 200 మంది లబ్దిదారులకు, సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, కూకట్ పల్లి నియోజకవర్గం కు చెందిన 500 మందికి మొత్తం 1700 మంది లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా జరుగనుంది..

- Advertisement -

ఇక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంఖాల్-1 లొకేషన్ లో నిర్మించిన 2230 లబ్దిదారులకు గృహాలను పంపిణీ చేస్తారు. అందులో మాంఖాల్-1 లో నిర్మించిన 500 గృహాలను మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. మాంఖాల్-2 లో నిర్మించిన 1730 గృహాలను మలక్ పేట్ నియోజకవర్గానికి చెందిన 50 మంది లబ్దిదారులకు, యాకత్ పుర నియోజకవర్గం కు చెందిన 500 మంది లబ్దిదారులు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన 230 మంది లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ సర్వే నెం.82, 83/పి లొకేషన్లలో, బహదూర్ పుర నియోజకవర్గం పరిధిలోని ఫారూక్ నగర్ లొకేషన్ లో నిర్మించిన 770 గృహాలు ఎంపిక చేసిన లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. బండ్లగూడలో నిర్మించిన 270 గృహాలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గం కు చెందిన వారికి పంపిణీ చేస్తారు. ఫారూక్ నగర్ లో నిర్మించిన 500 గృహాలను బహదూర్ పుర నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు పంపిణీ చేస్తారు.

రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని నార్సింగి, బైరాగి గూడ-2 లొకేషన్లలో నిర్మించిన 356 ఇళ్లను నార్సింగి సర్వే నెం.117 లొకేషన్ లో 356 గృహాలను పంపిణీ చేస్తారు. అందులో నార్సింగి సర్వే నెం.117 లో నిర్మించిన 196 గృహాలు, బైరాగి గూడ-2 లో నిర్మించిన 160 గృహాలు మొత్తం 356 మంది లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నల్లగండ్ల సర్వే నెం.125 లొకేషన్ లో సాయి నగర్ హఫీజ్ పేట్ నల్లగండ్ల కాలనీకి సంబంధించిన 344 గృహాలు అందులో నల్లగండ్ల సర్వే నెం. 125 కాలనీకి చెందిన 216, సాయినగర్ హఫీజ్ పేట్ కు చెందిన 168 గృహాలు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

మంత్రి హరీష్ రావు పటాన్ చెరు నియోజకవర్గంలోని కొల్లూర్-1 లొకేషన్ లో 3,300 మంది లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. అందులో కొల్లూరు-1 కాలనీకి చెందిన 1500 గృహాలు ఖైరతాబాద్ నియోజకవర్గం 200, జూబ్లీహిల్స్ 500, శేరిలింగంపల్లి 156, రాజేంద్రనగర్ 144, పటాన్ చెరు 500 గృహాలు, అమీన్ పూర్-2 లో నిర్మించిన 1800 గృహాలను గోషామహల్ కు 500, నాంపల్లి 500, కార్వాన్ 500, ఖైరతాబాద్ 300 గృహాలు లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. మంత్రి చామకూర మల్లారెడ్డి: మేడ్చల్ నియోజకవర్గంలోని అహ్మద్ గూడ లొకేషన్ 1500 మంది లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. అందులో మల్కాజ్ గిరి 500, ముషీరాబాద్ 500, సికింద్రాబాద్ 500 మంది లబ్దిదారులకు అందజేస్తారు. ఇక జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఉప్పల్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ లొకేషన్ లో 500 గృహాలను లబ్దిదారులకు అందజేస్తారు. శ్రీనగర్ కాలనీ సర్వే నెం.710/పి లొకేషన్ లో నిర్మించిన 500 గృహాలను ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు అందజేస్తారు. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప్ సింగారం లొకేషన్ లో 1000 గృహాలను ఎల్బీనగర్ నియోజకవర్గం కు 500, అంబర్ పేట్ నియోజకవర్గం కు 500 మంది లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు