Monday, May 6, 2024

చర్చకు సిద్ధమా..?

తప్పక చదవండి
  • మంత్రి గంగుల కమలాకర్ కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్
  • డాక్యుమెంట్లతో రా….నా ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు రెడీ
  • నీ ఆస్తిపాస్తులన్నీ కరీంనగర్ ప్రజలకు పంచే దమ్ముందా?
  • గ్రానైట్ ఎన్నికల్లో గంగుల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడతా
  • ఎవడు అడ్డమొచ్చినా గ్రానైట్ యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తా
  • మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలంతా బిచ్చమెత్తుకోవాల్సిందే
  • కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్

కరీంనగర్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బండి సంజయ్‌ వర్సెస్‌ గంగుల కమలాకర్‌గా కరీంనగర్‌లో రాజకీయం మారిపోయింది. ఒవైసీకి బొట్టు పెట్టించి హనుమాన్‌ చాలీసా చదివించే దమ్ముందా..? అని బండి సంజయ్‌ సవాల్‌ విసిరితే..అదే రేంజ్‌లో మంత్రి గంగుల కౌంటరిచ్చారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన కారణంగానే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండిని తప్పించారని ఆరోపించారు. ఆదివారం బండి సంజయ్ కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో గంగులపై సవాల్ చేస్తూ.. కమలాకర్ నన్ను అవినీతిపరుడంటున్నడు… నేను సవాల్ చేస్తున్న.. నేను అవినీతితో ఎంత ఆస్తి సంపాదించానో ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకుని రా… అవన్నీ బావూపేటసహా కరీంనగర్ ప్రజలందరికీ రాసిస్తా.. అట్లాగే నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ నేను తీసుకొస్తా… వాటిని బావూపేటసహా కరీంనగర్ ప్రజలకు రాాసిస్తావా? అంటూ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించి రావాలని ఛాలెంజ్ విసిరారు.

గంగుల కమలాకర్ నిన్న కొత్తకొత్త మాటలు చెబుతుండు.. ఈసారి గెలిపిస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తడట.. .అందరికీ ఇండ్లు ఇస్తడట… బండి సంజయ్ కంటే గొప్ప హిందువును నేనేనని ప్రచారం చేస్తున్నడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే… మంత్రిగా పనిచేసినవ్. రేషన్ కార్డుల మంత్రివి కూడా నువ్వే… ఎంతమందికి రేషన్ కార్డులిచ్చినవ్. బీసీ మంత్రివి నువ్వే కదా… బీసీ బంధు ఎంతమంది బీసీలకు ఇచ్చినవ్? 10 ఏళ్లుగా ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినవ్? నన్ను ఎంపీగా గెలిపిస్తే… కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం 9 వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన. ఆర్వోబీ, స్మార్ట్ సిటీ, రోడ్లు, వీధి దీపాలుసహా గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే అభివ్రుద్ధి పనులకు కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చింది నేనే.. మోదీ గత 6 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఒక్క అవినీతి లేకుండా నేరుగా అపాయిట్ మెంట్ లెటర్లు ఇచ్చారు.. మరి నేనడుగుతున్నా… కేసీఆర్ ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు? ఎంత మందికి నిరుద్యోగ భ్రుతి ఇచ్చారో చెప్పాలి? మీ కోసం నేను కొట్లాడిన. నిరుద్యోగుల కోసం పోరాడితే నన్ను అర్ధరాత్రి గుంజుకుపోయి జైల్లో వేశారు.. ఉద్యోగుల కోసం పోరాితే నా ఆఫీస్ ధ్వంసం చేసి నన్ను లాక్కుపోయి జైల్లో వేశారు. పండించిన వడ్లను కొనాలని రైతుల పక్షాన నేను ధాన్యం కేంద్రాలకు పోతే… నాపైనా, బీజేపీ కార్యకర్తలపైనా రాళ్ల దాడి చేసిర్రు. మీకు తెలుసా…. మీ కోసం నేను పోరాడితే కేసీఆర్ ప్రభుత్వం నాపై 74 కేసులు పెట్టారు. అయినా నేను భయపడలే.. మీకోసం ఎందాకైనా పోరాడతానన్నారు ఇప్పుడు నేను కమలాకర్ ను అడుగుతున్నా… నేను 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చిన. లెక్క పత్రం నా దగ్గర సిద్ధంగా ఉంది. నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చర్చిద్దాం రా అంటూ సవాల్ విసిరారు.

- Advertisement -

ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన అన్నారు. కేసీఆర్‌పై కొట్లాడితే నాపై 74 కేసులు పెట్టారు.. అయినా డోన్ట్ కేర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒవైసీకి సవాల్ చేసి పాతబస్తీలో సభ సక్సెస్ చేసి సత్తా చాటినమని, 12 శాతం ఓట్లకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒవైసీకి సలాం చేస్తున్నారన్నారు బండి సంజయ్‌. కేసీఆర్… అయోధ్యలో రాముడు జన్మించారా? లేదా? చెప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. పొరపాటున కేసీఆర్ కు అవకాశమిస్తే… రాముడు అయోధ్యలోనే పుట్టలేదంటాడు? అని బండి సంజయ్‌ అన్నారు. ఆదిలాబాద్ పటాన్ చెరువు నారాయణఖేడ్ నియోజకవర్గం మీదుగా రైల్వే లైన్ ను తీసుకొస్తామని, లింగాయత్, ఆరె మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియ పూర్తి కావొచ్చిందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు