Saturday, April 27, 2024

కాలి బూడిద..

తప్పక చదవండి
  • దిల్‌సుఖ్‌నగర్‌లో ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం..
  • అగ్నికి ఆహుతయిన రెండు ఆర్టీసీ బస్సులు
  • ప్రయాణీకులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
  • ఒక బస్సు పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు పాక్షికంగా..
  • సాంకేతిక సమస్యల కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తింపు
  • సమగ్ర విచారణకు ఆదేశించిన టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం

ఆగి ఉన్న రెండు టీఎస్‌ ఆర్టీసీ బస్సులు మంటలకు గురై పూర్తిగా దగ్ధమైన ఘటన హైదరాబాద్‌? నగరంలోని దిల్‌?సుఖ్‌?నగర్‌? ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివల్లోకి వెళ్ళితే దిల్‌?సుఖ్‌?నగర్‌ బస్‌ డిపోలో నిలిపి ఉంచిన రెండు బస్సులు పూర్తిగా దగ్థమయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఒక బస్సు పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. మంటలను గమనించిన బస్సు డిపో సెక్యూరిటీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ ఇంజన్లు వచ్చేలోపు అందుబాటులో ఉన్న వాటితో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోపు మలక్‌?పేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బ్యాటరీలోని కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు ఫైర్‌ సిబ్బంది. అయితే పూర్తి స్థాయిలో ఈ ఘటనపై సమగ్ర విచారణ కు టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు