Thursday, May 2, 2024

శత్రువుకు వణుకే..

తప్పక చదవండి
  • భారత వైమానిక దళంలోకి ఫైటర్‌ జెట్స్‌
  • 97 తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఆమోదం
  • 84 ‘సుఖోయ్‌-30’ యుద్ధవిమానాల అభివృద్ధి ప్రణాళికకూ ప్రాథమిక ఆమోదం

న్యూఢిల్లీ : భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. భారీ సంఖ్యంలో ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలుకు డిఫెన్స్‌ ప్యానెల్‌ ఓకే చెప్పింది. 97 తేజస్‌ లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు వాయుసేనకు చెందిన 84 ‘సుఖోయ్‌-30’ యుద్ధవిమానాల అభివృద్ధి ప్రణాళికకూ ప్రాథమిక ఆమోదం తెలిపింది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్‌ అక్వైజిషన్‌ కౌన్సిల్‌ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ఆయా ఒప్పందాల విలువ దాదాపు రూ.1.6 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. తేజస్‌ ‘మార్క్‌ 1-ఏ’ యుద్ధ విమానాలను వాయు సేన కోసం, హెలికాప్టర్లను వాయుసేనతోపాటు ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ‘తేజస్‌’ తేలికపాటి యుద్ధవిమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ దీన్ని రూపొందించింది. యాక్టివ్‌ ఎలక్ట్రానిక్‌- స్కాన్డ్‌ అర్రే రాడార్‌, ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ సూట్‌ తదితర సామర్ధ్యాలు దీని సొంతం. ‘‘ప్రచండ’నూ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ రూపొందించింది. ఈ హెలికాప్టర్ల మొదటి బ్యాచ్ను గత సంవత్సరం వాయుసేన, సైన్యంలోకి చేర్చారు. 21 వేల అడుగుల ఎత్తులోనూ సేవలు అందించగలదు. సియాచిన్‌, లద్దాఫ్‌, అరుణాచల్‌ ప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతాల్లోనూ మోహరించేలా దీన్ని రూపొందించారు. ఇదిలా ఉండగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కర్ణాటక పర్యటన సందర్భంగా తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్‌’లో విహరించిన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు