హైదరాబాద్ : బీ.ఆర్.ఎస్. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు కుమారులపై క్రిమినల్ కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.. విప్లవ్ కుమార్, వెంకటేశ్వర రావులపై హైదరాబాద్ బంజారా హిల్స్, పోలీస్ స్టేషన్ లో నెలరోజుల క్రితం ఈ కేసు నమోదు చేశారు.. ఎన్.ఆర్.ఐ. మహిళకు చెందిన భూమిని ఫోర్జరీ సంతకాలతో వీరిద్దరూ అమ్మేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. కాగా ఈ కేసు బయటకు రాకుండా పోలీసులు జాగర్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది..