- కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు
- అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎల్పీ నేత..
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పూజారులు
- సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం
హైదరాబాద్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భం గా ఆలయ పూజారులు వాతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారికి భట్టి దంపతులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆశీర్వచనం చేసి అమ్మవారి పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని ఆలయ పూజారులు వారికి అందజేశారు. సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భట్టి విక్రమార్క దంపతులకు ఆలయ వద్ద ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు. ఆలయానికి వచ్చిన భట్టి విక్రమార్కను బందోబస్తు పర్యవేక్షణకు విచ్చేసిన అడిషనల్ డీజి సుధీర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు
తప్పక చదవండి
-Advertisement-