- ఎస్.పిలతో డీజీపీ అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న శాసన సభ ఎన్నికలు, అక్టోబర్ 3 వ తేదీ నుండి 5 వ తేదీ వరకు హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనల నేపథ్యంలో పోలీస్ శాఖ సన్నద్ధత పై నేడు డీజీపీ అంజనీ కుమార్ సీనియర్ పోలీస్ అధికారులు, యూనిట్ అధికారులు, పోలీస్ కమీషనర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ డీజీ లు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సంజయ్ కుమార్ జైన్ లతోపాటు ఐజి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా త్వరలో జరుగబోయే ఎన్నికల సందర్బంగా చేపట్టిన ఏర్పాట్లపై సి.పీ లు, ఎస్. పి లు వివరించారు.