- రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కందుకూరు మండలం
ఎంపీఓ కళ్యాణి, కార్యదర్శి నరేందర్..
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు రోజు రోజుకూ పట్టుబడిపోతున్నారు.. తాజాగా కందుకూరు మండలం ఎంపీఓ కళ్యాణి, కార్యదర్శి నరేటర్ లు మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ. 2, 50, 000 లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు.. ముందుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు దాడి చేసి వారిని పట్టుకుని, అదుపులోకి తీసుకున్నారు.. కేసు విచారణలో ఉందని అధికారులు తెలిపారు..