- స్వస్తి ఆస్తు విశ్వ శాంతి కోసం ప్రార్ధనతో
సమావేశం ముగించిన ప్రధాని మోడీ.. - జీ -20 చైర్మన్ బాధ్యతలు బ్రెజిల్ అధ్యక్షులు
లూయిజ్ ఇనాసియోకు అప్పగింత.. - 140 కోట్ల భారతీయులకు ధన్యవాదాలు.. శుభాకాంక్షలు..
- ఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపిన చైనా, రష్యా అధ్యక్షులు..
- 200 గంటల పాటు నిరంతర చర్చలు..
- 300 ద్వైపాక్షిక సమావేశాలు జరిగిన వైనం..
- బ్రెజిల్ కు అవసరమైన సహాయం ఆడిస్తాం : మోడీ..
న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ‘స్వస్తి అస్తు విశ్వ’ – శాంతి కోసం ప్రార్థనతో జీ – 20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు. జీ – 20 చైర్మన్ పదవి బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు అప్పగించారు. సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “జీ – 20 శిఖరాగ్ర సమావేశం ముగిసినట్లు నేను ప్రకటించాను. ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు రోడ్మ్యాప్ ఆనందంగా ఉంటుందని ఆశిస్తున్నాను. 140 కోట్ల భారతీయుల అదే శుభాకాంక్షలతో, మీకు “ధన్యవాదాలు మీరు ప్రతి ఒక్కరికీ చాలా సంతోషిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియోకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జీ – 20 అధ్యక్ష పదవిని ఆయనకు అప్పగిస్తున్నాను.”
చైనా , రష్యా దేశాధ్యక్షులు సమావేశానికి హాజరుకానప్పటికి ఢిల్లీ డిక్లరేషన్కు ఆమోదం తెలిపారు. దురాక్రమణలకు దూరంగా ఉండాలన్న సందేశాన్ని ఈ సమావేశాలు ఇచ్చాయి. జీ-20లో కొత్తగా ఆఫ్రికా యూనియన్కు సభ్యత్వం ఇవ్వడంతో కూటమి దేశాల సంఖ్య 21కు చేరుకుంది. ముగింపు రోజు అతిధులు ఢిల్లీ లోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్ను సందర్శించారు. గాంధీజీకి దేశాధినేతలు ఘననివాళి అర్పించారు. జీ-20 సమావేశాలు ముగియడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వియత్నాం బయలుదేరారు.
జీ-20 సమావేశాల్లో 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. 15 ముసాయిదాలను చర్చించారు. జీ20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్దంపై ఏకాభ్రియాన్ని సాధించారు.
నవంబర్లో వర్చువల్ సెషన్ను ప్రతిపాదిస్తూ.. పీఎం మోదీ మాట్లాడుతూ, “నవంబర్ వరకు భారతదేశానికి జీ -20 అధ్యక్ష పదవి ఉంది. ఈ రెండు రోజుల్లో, మీరు చాలా విషయాలు, ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. ఏ సలహాలు వచ్చినా స్వీకరించడం.. ఎలా చూడటం మా బాధ్యత. వారి పురోగతిని వేగవంతం చేయవచ్చా మీతో పంచుకోండి. మీరందరూ దీనితో కనెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను.” ప్రధాని మోదీ కూడా ట్విట్టర్లో ఇలా వ్రాశారు, “భారతదేశం బ్రెజిల్కు చైర్మన్ని అప్పగించింది. వారు అంకితభావంతో, దృక్పథంతో నాయకత్వం వహిస్తారని మరియు ప్రపంచ ఐక్యతతో పాటు శ్రేయస్సును ముందుకు తీసుకువెళతారని మాకు అచంచలమైన విశ్వాసం ఉంది. రాబోయే జీ 20 అధ్యక్ష పదవిని భారతదేశం అప్పగించింది. తన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రెజిల్కు సాధ్యమైన అన్ని సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.