Tuesday, May 21, 2024

ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త..

తప్పక చదవండి
  • వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలపై జగన్ సమీక్ష
  • అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైంది అన్నారు. అయినా జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం పడిందన్నారు. ముందస్తు రబీ పంటలు వేసే అవకాశం ఉందని..విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అలాగే రైతు భరోసాపై క్లారిటీ ఇఛ్చారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా.. రైతులకు మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు. ఎప్పటిలానే మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలి అన్నారు. వ్యవసాయం, పౌరసరఫరాల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఆహారశుద్ధి రంగంలో ఏర్పాటుచేస్తున్న యూనిట్లను ఉపయోగించుకుని చిరుధాన్యాలను ప్రాసెస్‌ చేయాలని సూచించారు. పీడీఎస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలని సూచించారు. మిల్లెట్ల వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై కరపత్రాలతో అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈ ఏడాది రెండో విడత రైతు భరోసాకు సిద్ధం కావాలి అన్నారు. అయితే ఎప్పుడు అనేది త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి అన్నారు. చేయూత కింద మహిళలకోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగించాలి అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలని కోరారు. ధాన్యం రైతులకు మద్దతు ధరతోపాటు జీఎల్‌టీ రూపంలో అదనంగా క్వింటాకు రూ.250 చొప్పున ఇస్తున్నామన్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాలని అధికారులకు సూచించారు. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.31,005.04 కోట్లు అందించామని.. త్వరలో రెండో విడత రైతు భరోసాను అకౌంట్‌లలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నవంబర్‌ మొదటి వారంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి అన్నారు. ఏటా సీజన్‌లో పంటలు వేయటానికి ముందే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసి వాటి ఫలితాలతో కూడిన సర్టిఫికెట్లను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి అన్నారు. అందుకు అవసరమైన పరికరాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చూడాలన్నారు. ముందుగానే భూసార పరీక్షలు చేయడం ద్వారా ఏ పంటలు వేయాలి?.. ఏయే రకాల ఎరువులు ఎంత మో తాదులో వేయాలన్న దానిపై రైతులకు అవగాహన కల్పిస్తూ పూర్తి వివరాలు అందించేలా ఉండాలి అన్నారు. దీనివల్ల అవసరమైన మేరకు మాత్రమే ఎరువుల ను వినియోగిస్తారని.. తద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు కలిసి వస్తయన్నారు సీఎం. ఖరీఫ్‌లో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు దాదాపు సాధారణ వర్షపాతమే నమోదైందని అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే ముందస్తు రబీకి రైతులు సిద్ధమవుతున్నారని.. సెనగ సహా ఇతర విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సరిపడా ఎరువుల నిల్వలున్నాయని.. ఎలాంటి సమస్యా లేదన్నారు. రబీలో సాగుచేసే శనగ విత్తనాలపై సబ్సిడీని 25 శాతం నుంచి 40 శాతానికి పెంచామన్నారు. ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే 85 శాతం ఇ–క్రాప్‌ పూర్తి చేశామని.. అక్టోబరు 15 లోగా వంద శాతం లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు అధికారులు. జూన్, ఆగస్టులో వర్షాలు లేకపోవడం పంటల సాగుపై కొంత మేర ప్రభావం చూపిందన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిలోని డీఆర్‌ఓజీఓ– ఆర్‌టీపీఓ కేంద్రాల్లో ఔత్సాహికులైన వారికి కిసాన్‌ డ్రోన్లపై శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. పశుగ్రామం, దాణా కొరత లేకుండా చూడాలన్నారు సీఎం.. ప్రతి ఆర్బీకే యూనిట్‌గా పశువులకు టీఎంఆర్‌ ఇచ్చేలా చూడాలన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు