- షాద్ నగర్ బైపాస్లో రోడ్డు ప్రక్కన విసిరేసిన సంఘటన
షాద్ నగర్ క్రైమ్ : ఓ తండ్రి తాగిన మైకంలో 11 నెలల కన్న కూతురిని విచక్షణ రహితంగా విసిరేసిన ఘటన షాద్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలప్రకారం…కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాల యముడుగా మారాడని స్థానికులు ఆవేదన చెందారు.షాద్ నగర్ పట్టణ కేంద్రంలో రసోయ్ హోటల్ సమీపంలో బైపాస్ పక్కన విసిరేశాడు ఓ కసాయి తండ్రి. స్థానికులు పోలీసులకు సమచారం అందించటం తో సంఘటన స్థలానికి చేరుకొని చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన ఉన్నత పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరిన్ని పూర్తీ వివరాలు పోలీసు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. విచారణలో ఏసిపి రంగస్వామి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి, ఎస్సై దేవకి ఎస్సై నయముద్దీన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.