Saturday, May 4, 2024

40 మంది సేఫ్?

తప్పక చదవండి
  • ఉత్తరాఖండ్ లో నేషనల్ హైవేపై టన్నెల్ నిర్మాణ పనులు
  • ఆదివారం పాక్షికంగా కూలడంతో లోపలే చిక్కుకున్న వర్కర్లు
  • టన్నెల్ స్లాబ్ తవ్వి వర్కర్లను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నం

ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయిన విషయం తెలిసిందే. ఇందులో 40 మంది కూలీలు చిక్కుకుపోగా.. వారంతా క్షేమంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. లోపలి చిక్కుకున్నవారికి పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. తాగునీరు కూడా అందజేస్తున్నామని, బాధితులతో కాంటాక్ట్ అయ్యామని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌‌లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నాయి.

అసలేం జరిగిందంటే..
ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న ఓ టన్నెల్ ఆదివారం పాక్షికంగా కూలిపోయింది. దీంతో 40 మంది వర్కర్లు లోపలే చిక్కుకుపోయారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి వర్కర్లు లోపలే ఉండిపోయారు. ప్రమాద విషయం తెలిసి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ లు రంగంలోకి దిగాయి. టన్నెల్ స్లాబ్ ను తవ్వి వర్కర్లను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 20 మీటర్ల మేర స్లాబ్ తొలగించినట్లు ఉత్తరకాశీ సర్కిల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మరో 35 మీటర్ల దాకా తవ్వాల్సి ఉందని వివరించారు. దీంతో పాటు టన్నెల్ కూలడంతో పూడుకుపోయిన మార్గాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకోసం ఎక్స్ కవేటర్లతో పాటు భారీ మెషీన్లను ఉపయోగిస్తున్నామని వివరించారు.

- Advertisement -

టన్నెల్ ఎక్కడ నిర్మిస్తున్నారంటే..
సిల్క్యారా, దండల్ గావ్ లను కలిపేందుకు బ్రహ్మఖల్- యమునోత్రి నేషనల్ హైవేపై ప్రభుత్వం ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టింది. ఈ టన్నెల్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఉత్తరకాశీ నుంచి యమునోత్రి మధ్య దూరం 26 కిలోమీటర్లు తగ్గనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు