Tuesday, April 30, 2024

సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ దూరం!

తప్పక చదవండి

బెంగాల్ : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ఒకే భావజాలం ఉన్న పార్టీల నేతలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా.. తామంతా ఒక్కటే అనే సందేశం ఇవ్వాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లాకు ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. బీహార్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, మరికొందరు ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించారు.

బెంగళూరు చేరుకున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌
అయితే.. వేరే నేతల సంగతి ఎలా ఉన్నా.. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి బెంగాల్ సీఎం మమత దూరంగా ఉండనున్నారు. తాను కాకుండా.. మమత తన ప్రతినిధిని పంపాలని నిర్ణయించుకున్నారు. తన తరఫున టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్‌ను పంపనున్నారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సిద్ధరామయ్యకు మమత అభినందనలు తెలిపారు. అయితే.. దీదీ ఎందుకు దూరంగా ఉంటున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు