- పోలీసులకు ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ : తొమ్మిదేళ్ల బాలికపై సాయి(23) అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కూతుర్ని అడగ్గా అసలు విషయం బయటకు వచ్చింది. విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులు స్కూళ్లకి సెలవు ప్రకటించడంతో మైనర్ బాలిక ఇంట్లోనే ఉంటోంది. సాయి అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు మైనర్ బాలిక తల్లితో చెప్పింది. తల్లిదండ్రులకు చెబితే చంపుతానని సాయి సదరు మైనర్ బాలికను బెదిరించినట్టుగా తెలుస్తోంది. అనంతరం పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సాయిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు.