Tuesday, April 30, 2024

త్వరలో మార్కెట్లోకి షియోమీ 14 ఫోన్‌..

తప్పక చదవండి

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ14 సిరీస్‌ ఫోన్లను త్వరలో భారత్‌ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. షియోమీ 14 సిరీస్‌లో షియోమీ14, షియోమీ 14 ప్రో ఫోన్లు ఉన్నాయి. క్వాల్‌ కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తుందని తెలుస్తున్నది. గ్లోబల్‌ మార్కెట్లలో త్వరలో జరిగే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (ఎండబ్ల్యూసీ 2024)లో ఈ ఫోన్లను ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది. ఎండబ్ల్యూసీ 2024 సదస్సు వచ్చేనెల 26-29 మధ్య జరుగనున్నది. గత అక్టోబర్‌లో చైనాలో ఆవిష్కరించిన షియోమీ 14 ఫోన్‌ 6.36-అంగుళాల 1.5కే (1200ఐ2600 పిక్సెల్స్‌) ఎల్టీపీఓ అమోలెడ్‌ స్క్రీన్‌ విత్‌ 120 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ కలిగి ఉంది. 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. షియోమీ 14 ఫోన్‌ 50 -మెగా పిక్సెల్‌ ట్రిపుల్‌ రేర్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్‌ కోసం 32-మెగా పిక్సెల్‌ సెన్సర్‌ కెమెరా వస్తుంది. 90 వాట్ల వైర్డ్‌ చార్జింగ్‌, 50 వాట్ల వైర్‌ లెస్‌ చార్జింగ్‌, 10వాట్ల రివర్స్‌ వైర్‌ లెస్‌ చార్జింగ్‌ మద్దతుతో 4610 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీ కూడా ఉంటది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు