ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ14 సిరీస్ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. షియోమీ 14 సిరీస్లో షియోమీ14, షియోమీ 14 ప్రో ఫోన్లు ఉన్నాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్తో వస్తుందని తెలుస్తున్నది. గ్లోబల్ మార్కెట్లలో త్వరలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ 2024)లో ఈ ఫోన్లను ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది. ఎండబ్ల్యూసీ 2024 సదస్సు వచ్చేనెల 26-29 మధ్య జరుగనున్నది. గత అక్టోబర్లో చైనాలో ఆవిష్కరించిన షియోమీ 14 ఫోన్ 6.36-అంగుళాల 1.5కే (1200ఐ2600 పిక్సెల్స్) ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తోంది. షియోమీ 14 ఫోన్ 50 -మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా వస్తుంది. 90 వాట్ల వైర్డ్ చార్జింగ్, 50 వాట్ల వైర్ లెస్ చార్జింగ్, 10వాట్ల రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కూడా ఉంటది.