- ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి..
- కేసీఆర్ కుటుంబానికి సేవచేసే వ్యక్తులను
ఎమ్మెల్సీలుగా తీసుకోవాలా..? - అవి సేవకులకు ఇచ్చే నామినేటెడ్ పదవులు..
హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయానికి అభినందనలు తెలుపడంతోపాటు ధన్యవాదాలు చెబుతున్నాం అన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.. గవర్నర్ కోటా, రాష్ట్రపతి కోటాలు మేధావులకు, విద్యావంతులకు, కవులకు, కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కూడా అనేక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్కు ప్రతిపాదనలు పంపితే.. గౌరవ గవర్నర్ గారు రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి టికెట్లు ఇస్తదంటే.. వాళ్ల కాళ్లదగ్గరపడి ఉండేవాళ్లకు, వాళ్ల మోచేతి నీళ్లు తాగే వాళ్లకు, ఆత్మగౌరవం లేని వాళ్లకు ఇస్తుంది. గవర్నర్ కోటా నామినేటెడ్ పోస్టులు కూడా అలాంటి వారికే ఇవ్వాలన్నది న్యాయం కాదు. ఈ విషయంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించదగినది. అనేక పార్టీలు ఫిరాయించిన వారు, కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సేవ చేసే వారిని గవర్నర్ రిజెక్ట్ చేశారు. అలాగే చేయాలి కూడా. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ, బీజేపీతో ఏ మాత్రం సంబంధం లేని తెలంగాణ నుంచి ఒక సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎంపీగా ప్రతిపాదిస్తే రాష్ట్రపతి ఆమోదం పొందారు. దక్షిణాది నుంచి పీటీ ఉష లాంటి అంతర్జాతీయ క్రీడాకారిణిని ప్రతిపాదించగా రాష్ట్రపతి ఓకే చేశారు. తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. ఆమెకు తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నం. కేసీఆర్కు అనుకూలంగా ఉంటేనే.. గవర్నర్గా వ్యవహరించినట్టా? కేసీఆర్ చేస్తున్న తప్పిదాలు, పొరపాట్లను ఎత్తి చూపుతూ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే.. గవర్నర్గా మీక నచ్చరా? అని ప్రశ్నిస్తున్నాను. గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరిస్తారు.. ఏ పార్టీతో ఆ పదవికి సంబంధం ఉండదు. తమ కాళ్ల దగ్గర ఉండేవాళ్లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉండాలని కోరుకోవడం సమంజసం కాదు.. తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అన్నారు కిషన్ రెడ్డి.. .