హైదరాబాద్ : సనాతన ధర్మంపై తమిళనాడు రాజకీయ నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు పేర్కోన్నారు. అధికార మదంతో ప్రశాంతంగా ఉన్న సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొంతమంది చేస్తున్న కుట్రలు మానుకోవాలని ఆయన ఘాటుగా ఆరోపించారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆలీకేఫ్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గౌతమ్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ గౌడ్, యశ్వంత్, రవీందర్ యాదవ్, శీర్ సాగర్, సునీల్, మనోజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు..