- ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలతో అనర్హుల్లో ఆందోళనలు
- వైఎఫ్డిఆర్ ప్రతినిధులను బెదిరింపులు
- భయపడేది లేదంటున్న వైఎఫ్డిఆర్ ప్రతినిధులు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జెన్ కో కంత్రీలు అనే శీర్షికతో గత కొద్దిరోజులుగా వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాలతో నకిలీ స్థానిక అభ్యర్డుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తదనుగుణంగానే, జెన్ కో కంత్రిలు తమ నకిలీ సర్టిఫికేట్ ల బాగోతం బట్ట బయలు అవుతుందనే భయంతో యూత్ ఫోరం ఫర్ డిమెక్రటీ రైట్స్ (వైఎఫ్డిఆర్) ను ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. తమకు ఓ మంత్రి భర్త అండ దండలున్నాయనీ, అవసరమైతే ఎంతటికైన తెగిస్తామని, ఇంతటితో ఇక నిజమైన స్థానిక అభ్యర్ధుల తరపున న్యాయ పోరాటాన్ని ఆపాలని ఫోన్ల ద్వారా, మెసేజ్ ల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ నకిలీ స్థానిక అభ్యర్ధులు, చెల్పుర్ లోని కెటిపిపి అధికారులను డబ్బు ద్వారా మేనేజ్ చేసి, సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచార వివరాలు, దరఖాస్తుదారుని సమాచారం అందించడంతో, వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎఫ్డిఆర్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
వైఎఫ్డిఆర్ ప్రతినిధులు ఈ నకిలీ స్థానిక అభ్యర్ధుల పూర్వపు ఖమ్మం జిల్లా యొక్క అన్ని సర్టిఫికేట్ లను ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకి వ్యక్తిగతంగా త్వరలో అందజేస్తామని తెలిపారు. ఎలాంటి బెదిరింపులకు భయ పడేది లేదని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తుంటామని వైఎఫ్డిఆర్ ప్రతినిధులు తెలిపారు.
భూపతి శ్రీనివాస్, సూరపురెడ్డి సతీష్, మీసాల శ్రీనివాసులు, బెల్లాల రవీందర్ లు అక్రమంగా నకిలీ స్థానికత సర్టిఫికేట్ లతో ఉద్యోగాలు పొందినట్లు ఆదాబ్ హైదరాబాద్ పత్రిక పూర్తి సమాచారం సేకరించింది. మరో కథనం ద్వారా వీరి అవినీతి బాగోతం మీ ముందుకు తేనుంది..