Sunday, May 19, 2024

రూ.12.5 కోట్ల బుద్ధ విగ్రహం చోరీ

తప్పక చదవండి

లాస్‌ ఏంజెల్స్‌ : అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ ఆర్ట్‌ గ్యాలరీలో 1.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 12.5 కోట్లు) విలువైన శతాబ్దాల నాటి జపాన్‌ కాంస్య బుద్ధ విగ్రహం చోరీకి గురైంది. ఆ చోరీకి సంబంధిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సెప్టెంబర్‌ 18న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో బెవర్లీ గ్రోవ్‌లోని బరాకత్‌ గ్యాలరీలో 113 కిలోల బరువున్న ఈ శిల్పం చోరీకి గురైందని లాస్‌ ఏంజిల్స్‌ పోలీసు విభాగం విూడియాకు తెలిపింది. గ్యాలరీ గేట్‌ను బద్దలు కొట్టి ట్రక్కుతోపాటు లోపలికి దుండగుడు ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీ చూపిస్తోంది. ఈ పురాతన బుద్ధుడి విగ్రహం 1603`1867 నాటిదని గ్యాలరీ యజమాని ఫయేజ్‌ బరాకత్‌ చెప్పారు. అద్భుతమైన ఈ కళాఖండం 55 సంవత్సరాల క్రితం ఆయన స్వాధీనంలోకి వచ్చింది. ఇలాంటిది మరెక్కడైనా ఉంటుందని తాను అనుకోనని గ్యాలరీ డైరెక్టర్‌ పాల్‌ హెండర్సన్‌ న్యూయార్క్‌ పోస్ట్‌కు చెప్పారు. నాలుగు అడుగుల పొడవు, లోపుల బోలుగా ఉండే ఈ కాంస్య విగ్రహం చాలా ప్రత్యేకమైందని, దీన్ని చోరీ చేసిన వ్యక్తి అమ్మడం చాలా కష్టమని ఆయన అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు