Friday, May 3, 2024

దేశంలోనే బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ రాజేంద్రనగర్‌ పీఎస్

తప్పక చదవండి
  • డీజీపీల సమావేశంలో కేంద్ర హోంశాఖమంత్రి నుంచి ట్రోఫీని అందుకున్న రాజేంద్రనగర్ పీఎస్ ఎస్‌హెచ్ఓ బి.నాగేంద్రబాబు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దేశం మొత్తం మీద నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. ఫిర్యాదుల స్వీకరణ, దర్యాప్తు, కేసుల పరిష్కారం, గుడ్ పోలీసింగ్ తదితర అంశాల ప్రాతిపదికగా 2023లో రాజేంద్రనగర్ స్టేషన్ దేశవ్యాప్తంగా అగ్ర స్థానంలో నిలిచినట్టు ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం జైపూర్ లో నిర్వహించిన డీజీపీల కాన్ఫరెన్స్ లో ఈ అవార్డను రాజేంద్రనగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బి నాగేంద్రబాబుకు హెూం మంత్రి అమిత్ షా అందజేశారు.

పరిగణనలోకి తీసుకునే అంశాలివే…
అత్యున్నతమైన సేవలందించే స్టేషన్లకు గుర్తింపునివ్వాలన్న సంకల్పంతో కేంద్ర హెూం మంత్రిత్వ శాఖ కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. హెూం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన వాటిల్లో ఉత్తమ సేవలందించిన స్టేషన్లకు ఈ అవార్డును అందజేస్తోంది. ఇందులో మహిళల భద్రత విషయంలో ప్రత్యేక చొరవ చూపించడం, భార్య, భర్తల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కౌన్సెలింగ్ నిర్వహించడం, మిస్సింగ్ కేసులను ట్రేస్ చేయడం, శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల ఛేదన, ఠాణాలకు వచ్చిన వారితో మర్యాద పూర్వకంగా మాట్లాడడం అంశాల్లో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ టాప్ వరసలో నిలిచింది. అంతేకాకుండా ఈ స్టేషన్ పరిధిలో చనిపోయిన వారి పూర్తి వివరాలు తెలుసుకుని వారి బంధువులకు మృతదేహాలు అప్పగించడంలోనూ ప్రత్యేక చొరవ చూపించారు.

- Advertisement -

17 వేల ఠాణాల్లో…
దేశంలోని 29 రాష్ట్రాలలో మొత్తం 17 వేలకు పైగా ఉన్న పోలీస్ స్టేషన్ల నుండి 74 ఠాణాలను ఈ అవార్డుల జాబితాలో చేర్చారు. ఇందులో తొలి మూడు పోలీస్ స్టేషన్ల పనితీరును ప్రామాణికం చేసుకుని అవార్డులకు ఎంపిక చేశారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో జమ్ము కశ్మీర్ లోని షేర్ ఘరీ, పశ్చిమ బెంగాల్ లోని సెరంపూర్ స్టేషన్ మూడో స్థానంలో నిలిచింది. రాజేంద్రనగర్ ఎస్ హెచ్ ఓ నాగేంద్ర బాబుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు