- నాపై దాడి చేసిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి..
- డిమాండ్ చేసిన కూన శ్రీశైలం గౌడ్..
హైదరాబాద్ : తనపై దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుత్బుల్లాపూర్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. ‘లైవ్ డిబేట్లో నేను ప్రజాసమస్యలు లేవనెత్తితే వివేకానంద నన్ను దుర్భాషలాడుతూ భౌతిక దాడికి దిగాడు. ఈ విషయమై సూరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. బీజేపీ కార్యకర్తలు, నా అభిమానులు సహనం కోల్పోవద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని కూన ట్వీట్ చేశారు.