Wednesday, May 15, 2024

గ్రామాల స్వయం సమృద్ధి ద్వారానే దేశాభివృద్ధి

తప్పక చదవండి

ఒక ఆలోచన దాని ఆచరణ జీవితాలను అత్యున్నత స్ధాయికి చేరుస్తుంది. సమిష్టి కృషి అభివృద్ధికి పునాదులు వేస్తుంది. రాచబాటలై రారాజులను చేస్తుంది. ఎవరో వచ్చి ఏదో చేసి మన బతుకులు బాగు చేస్తారనే బానిస మనస్తత్వాన్ని వదులు కోవడం నేటి రైతులకు నిరుద్యోగులకు అత్యావశ్యకం. అదీ దేశానికే వెన్నెముక లైన రైతులకు మరీ అవసరం. రైతులు స్వయం ఆలోచనలతో తమ వ్యవసాయం ద్వారా స్వయం సమృద్ధి సాధిస్తే దేశాభివృద్ధికి డోకా ఉండదు. మానవ సమాజం పురోగమిస్తోంది. ప్రతి అపజయం విజయానికి మెట్టు కావాలి. అనుభవం జీవితాలకు గుణపాఠం కావాలి. అప్పుడే సరిjైున వ్యవసాయం ద్వారా ప్రతి పల్లె ప్రగతి బాటలో పయనిస్తుంది. పట్టణ నగర జీవన వసతులతో పాటు ప్రకృతి సౌందర్య సొగసులు పల్లె ప్రజల జీవితాలను ఆనందమయం జేస్తాయి. అత్యద్భుతమైన మానవ సమాజ నిర్మాణానికి నాందీ పలుకుతాయి. ‘‘ఐకమత్యమే మహాబలం’’ అనే సామెత ఊరకనే పుట్టలేదు. ఇప్పటి మూడున్నరదశాబ్దాల రైతుల/అన్నదాతల ఆత్మ హత్యల పరంపరా విషాదానికి ప్రధాన కారణం గ్రామాలలోని రైతుల్లో ఐక్యతా భావన కొరవడడం, సమిష్టి కృషి కి స్వస్తి పలకడం, తాము కంపెనీల వలలో చిక్కుకుని నిరంతరంగా చేస్తున్న స్వయం తప్పిదాల నుండి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోకపోవడమే కాకుండా, పూర్తి స్థాయిలో పరాయీక రించ బడిన బానిస మనస్తత్వాన్ని వదలక పోవడం, ప్రగతిశీల ఆలోచనా రాహిత్యం మొదలగు అవలక్షణాలు గ్రామీణ వ్యవసాయ సంక్షోభానికి అతిపెద్ద కారణంగా చెప్పొచ్చు. బహుళ జాతి కంపెనీల కుట్రలు కుతంత్రాలకు వ్యవసాయం బలిపీఠమెక్కి ప్రజా జీవితం విషపూరిత ఆహారంతో రక రకాల క్యాన్సర్‌ లాంటి అతి భయంకర రోగాలతో పటా పంచలవు తుంది. మానవ జీవనానికి మూలాధారమైన భూమిలో విచక్షణా రహితంగా టవత్‌ీఱశ్రీఱఓవతీం జూవర్‌ఱషఱసవం ఱఅంవష్‌ఱషఱసవం ష్ట్రవతీపఱషఱసవం ఇంకా ఇతరత్రా అవాంఛనీయ రసాయనపదార్థాలను వాడి నిర్జీవం చేసి రైతులు అధిక పెట్టుబడి భారంతో ఆత్మ హత్యల పాల వుతూ ‘‘ఆరోగ్యకరమైన ఆహార సంక్షోభానికి’’ కారణ మవుతు న్నారు. సరిjైున ఆలోచన చేస్తే అభివృద్ధికి సవాలక్ష మార్గాలు. ఆచరిస్తే అభివృద్ధి సుగమమవుతుంది. పర్యావరణ, ప్రకృతి హిత వ్యవసాయానికి దారులు పడతాయి. నేటి, రాబోయే తరాల ఆరోగ్య జీవనాలకు మార్గ నిర్దేశనం చేసిన వారవుతారు. గతంనుండి నేర్చుకొని,వర్ధమానములో ఆచరిస్తూ, భవిష్యత్తు ను తీర్చి దిద్దుకోవాలి. స్వయం తప్పిదాలకు స్వస్తి పలకాలి. అంకిత భావంతో కూడిన నిరంతర సమిష్టి కృషి తోనే అభివృద్ధి సాధ్యమనే నగ్న సత్యంను ఆధునిక రైతులు గ్రహించాలి. గ్రామ గ్రామాన రైతులు వ్యవసాయాన్ని సమూల మార్పులతో రసాయన రహితంగా, స్థానిక విత్తనాలతో, పంటల వైవిధ్యం తో మోనో కల్చర్‌ కు స్వస్తి పలకడం ద్వారా గ్రామాలు వ్యవసాయం ద్వారా నే స్వయం సమృద్ధి సాధిస్తూ దేశాభివృద్ధికి పెద్ద పీట వేయవచ్చు. స్వయం సమృద్ధి సాధించిన గ్రామాల్లో అంకాపూర్‌ దేశంలోనే ప్రముఖమైనది. అంకాపూర్‌ గ్రామం నిజాం బాద్‌ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఆర్మూర్‌ కు దగ్గరగా జాతీయ రహదారి 63లో వుంది. ఒకప్పుడు అన్ని గ్రామా ల లాగే విత్తనాల పెట్టుబడులతో అప్పుల బాధలతో ఆత్మ హత్యలు వెళ్లదేసిన చరిత్ర అంకాపూర్‌ కూ ఉన్నది. కానీ ఆ రైతులు తాము చేస్తున్న స్వయం తప్పిదాలను గ్రహించారు. ఆత్మావలోకనం తో స్థానిక విత్తనాల తో నే సంక్షోభం గట్టెక్కొచ్చు అనే అభిప్రాయానికి వచ్చి, ఎర్ర జొన్న, మొక్క జొన్న, సోయా బీన్‌, పసుపు ను విరివిగా మేలు రకంగా పండిరచడం మొదలు పెట్టారు. ఆ విత్తనాలకు స్థానికంగా, జిల్లావ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్ధాయిలో డిమాండ్‌ పెరిగింది. కోట్ల రూపాయలు గడిరచింది. రైతులు ధనికులయ్యారు.35 సంవత్సరాల క్రితమే గ్రామాభి వృద్ధి కమిటీ తో పాటు, ఇతర కమిటీ లు వేసుకొని సమిష్టి గా , ఐక్యత తో రాజకీయాలను ప్రక్కన పెట్టి వ్యవసాయ అభివృద్ధికి పునాదులు వేశారు. గ్రామాభివృద్ధి కమిటీ చర్చల ద్వారా లాభదాయక వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ నాటు కోళ్లను పెంచడం మొదలు పెట్టారు. అంకాపూర్‌ (%షష్ట్రఱషసవఅ%) కోడి మాంసం రాష్ట్ర వ్యాప్తంగా పేరు గాంచింది. రైతుల ఆదాయాన్ని పెంచింది. అంకాపూర్‌ నుండి సుమారు 500మంది ఆస్ట్రేలియా అమెరికా బ్రిటన్‌ లాంటి దేశాల్లోనూ వివిధ ఉద్యోగాల ద్వారా గ్రామ ఆదాయాన్ని పెంచుతున్నారు. హైదరాబాద్‌ లోని బంజారహిల్స్‌ లాంటి బంగ్లాలు వీధులు కార్లు ఇతర వాహనాలతో మహానగరాన్ని తలపించేలా వుంది అంకాపూర్‌ గ్రామం. 32 విత్తన శుద్ధి కర్మాగారాలు 2016లోపే అక్కడ నెలకొన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 1520 ఇండ్లు,5,689 జనాభా. మొక్కజొన్న కంకులను విరివిగా పండిస్తారు. ప్రభుత్వ సాయాన్ని ఆశించడం వాళ్లకు టైం వేస్ట్‌ ప్రక్రియ. ఇక్రిశాట్‌,IజAR సంస్థలు గూడ అంకాపూర్‌ విత్తనాలు మేలైనవిగా గుర్తించాయి. తెలంగాణలోని వివిధ గ్రామాల రైతు కూలీలు అంకా పూర్‌, పస్తా పూర్‌ లలో పని ద్వారా ఉపాధి పొందుతున్నారు. అంకాపూర్‌ వ్యవసాయాభి వృద్ధికి ప్రధాన కారణం ఆ గ్రామ మహిళా రైతులే. ఇతర కూలీలతో పాటు ఆ గ్రామ మహిళా రైతులు కష్టించి పనిచేస్తారు. అంకాపూర్‌ చికెన్‌ ను పార్సిల్ల ద్వారా ఇతర దేశాలకు పంపిస్తున్నారు. ఒకప్పుడు నకీలీ విత్తనాలతో నష్ట పోయిన అంకాపూర్‌ రైతులు తామే మేలు రకం విత్తనాలు తయారు చేయాలని నిర్ణయించుకొని విత్తన సార్వబౌమత్వాన్ని సాధించారు. ఈ గ్రామ యువత అంకాపూర్‌ కొరకు ప్రత్యేక పోర్టలును తయారు చేసి అంతర్జాతీయంగా ఈ గ్రామం గురించి తెలుసుకునేలా చేస్తున్నారు. మట్టి నుండి మాణి క్యాలు బురద నుండి బువ్వను తీసే ఈ గ్రామం తెలంగాణకు దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఆదర్శం. ఏ రైతు బంధు పథకాలు, భీమాలు తమను వ్యవసాయ సంక్షోభం నుండి గట్టెక్కించలేవని, తమ పురోగమన ఆలోచనలే, గ్రామ గ్రామాన ఆంకా పూర్‌ గ్రామ రైతుల స్ఫూర్తిదాయక విధానాలే తమ అసలైన బంధులని, బంధువులు అని గ్రహించాలి. ఇప్పుడున్న స్వార్థ రాజకీయాల వలన ఇంకో వంద సంవత్సరాలైనా తాము అప్పుల బాధలనుండి గట్టెక్క లేమని గ్రహించి, తమ విత్తనాలకు తామే ధరలు నిర్ణయించుకునే లా, తాము ఏ పంటలు పండిరచాలో తామే నిర్ణయించుకునే లా అంకాపూర్‌ ను ఆదర్శంగా తీసుకుంటే ప్రతి గ్రామం స్వయం సమృద్ధి ని సాధించడం ఖాయం. దేశం అభివృద్ధి చెందడం సులభం. పాలకులకు ఇసుమంత చిత్తశుద్ది వున్నా అంకాపూర్‌ గ్రామ రైతుల స్ఫూర్తిని, వాళ్ల వ్యవసాయ విధానాలను, వాళ్ల సమిష్టి తత్వాన్ని, ఆ గ్రామ మహిళా రైతుల శ్రమ తత్వాన్ని ముందుకు తీసుకెల్తే యావద్దేశాన్నే స్వయం సమృద్ధి ని సాధించే లా చేసి విదేశీ అప్పుల నుండి బంధ విముక్తి గావించొచ్చు. మనమే ఇతర దేశాలకు ఋణా లివ్వొచ్చు. రాజకీయం వ్యాపారము గాదు. రాజకీయాలు ప్రజాసేవార్ధమనే భావన ప్రతి ఆధునిక రాజకీయునిలో కలగాలి. ఆచరించాలి. స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తి నెరవేరుతుంది. అక్రమ సంపాదన నంతా జాతికి అంకితం చేయాలి.

  • గడీల సుధాకర్‌ రెడ్డి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు