Saturday, April 27, 2024

వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై నారా లోకేష్ స్పందన

తప్పక చదవండి

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన 6 వేల డీఎస్సీ నోటిఫికేషన్ పై నారా లోకేష్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో లోకేష్.. 60 నెలలు అధికారం వెలగబెట్టి చివరి 60 రోజుల్లో 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అని హడావుడి చేస్తే జనం నమ్మరు జగన్. అంటూ తనదైన స్టైల్ లో రాసుకొచ్చారు. అలాగే.. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పుతో త్వరలో డ్రామాల వైసీపీ ప్రభుత్వం పోతుంది. యువతకు ఉద్యోగాలు ఇచ్చే దమ్మున్న టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని లోకేష్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా బుధవారం ఉదయం ప్రభుత్వం 6 వేల డీఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు