Sunday, May 19, 2024

నా మట్టి.. నా దేశం

తప్పక చదవండి

జనగామ : శుక్రవారం రోజు బిజెపి నర్మేట మండల అధ్యక్షులు ధరావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో అజాధి కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా, మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిన సందర్బంగా.. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరవీరులకు, దేశాన్ని కాపాడుతా ప్రాణాలు కోల్పోయిన సైనికులకు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులందరికి ఢిల్లీలో నిర్మించే స్ఫూర్తి వనం కోసం.. భారత దేశంలో ప్రతీ గ్రామం నుంచి మట్టి సేకరించడం జరుగుతున్నందున అందులో భాగంగా నర్మెట్ట మండల కేంద్రంలోని శివాలయం, వెంకటేశ్వర దేవాలయం నుండి, అన్ని గ్రామాల నుండి మట్టి సేకరించడం జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్, పాతూరి కరుణాకర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు పాతూరి నారాయణ, కొన్నేరాజు, రాజబోయిన జహంగీర్, కొమురవెల్లి ధరావత్, దేవేందర్, రవి, బ్రహ్మచారి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు