కరీంనగర్ : మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకోని శుక్రవారం కరీంనగర్ నిర్వహించారు. రాజీవ్ చౌక్లోని అస్లామ్ మసీద్ వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వమతాలను పండుగులను సంతోషంగా జరుపుకోవాలని, తెలంగాణరాష్ట్రలో అన్ని మతాలను సమానంగా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సామరస్యంగా అన్ని మతాల పండుగలు నిర్వహించుకోవడం సంతోషమని, మత సామర్యాన్నికి ప్రతీకగా కరీంనగర్ నిలిచిందన్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ను వారు శాలువతో సత్కరించారు.