Saturday, April 27, 2024

మయాంక్‌ అగర్వాల్‌కు అస్వస్థత

తప్పక చదవండి

భారత క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ఢిల్లీకి వెళ్లే విమానంలో అస్వస్థతకు గురికాగా.. అగర్తలలోని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీకి వెళ్లే విమానం టేకాఫ్‌ కాకముందే క్రికెటర్‌ అనారోగ్యానికి గురికావడంతో విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి తరలించారు. మయాంక్‌ అగర్వాల్‌ విమానంలో కూర్చున్న తర్వాత అతని గొంతులో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేశాడు. త్రిపుర రాజధాని అగర్తలలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మయాంక్‌ అగర్వాల్‌ అగర్తల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే విమానంలో ఆయనకు ఇలా జరగడానికి దారితీసింది ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది. దీంతో క్రికెటర్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. వారం ప్రారంభంలో అగర్తలాలో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కర్ణాటకకు నాయకత్వం వహించిన మయాంక్‌.. మధ్యాహ్నం 2:30 గంటలకు ఇండిగో విమానంలో ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. గొంతు సమస్య ఉందని ఫిర్యాదు చేయడంతో వెంటనే అతడిని విమానం నుంచి దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు