Wednesday, May 8, 2024

సీఎం కేసీఆర్ సభ స్థాలాన్ని పరిశీలించిన నాయకులు..

తప్పక చదవండి

మేడ్చల్ : ఈనెల 18వ తేదీన గుండ్ల పోచంపల్లి పరిధిలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఆర్థిక విజయం సాధించడం పక్కా అని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరుగుతుందని, మేడ్చల్ నియోజకవర్గం నుండి చామకూర మల్లారెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం కూడా గ్యారెంటీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, లంబాడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధనరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు