- సర్క్యులర్ జారీ చేసిన హైదరాబాద్ డీఈఓ..
- హర్షం వ్యక్తం చేసిన హెచ్.యూ.జే..
హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆర్.రోహిణి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ ఎడ్యకేషనల్ ఆఫీసర్స్, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూళ్లకు సర్య్కులర్ జారీ చేశారు. 2023–24 అకడమిక్ ఇయర్కు సంబంధించి హైదరాబాద్ స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూళ్ల ఫీజులో రాయితీ కోరుతూ ఇటీవల హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే –టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధి బృందం డీఈఓకు వినతి పత్రం అందించింది. దీనికి డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ.. సర్క్యూలర్ జారీ చేశారు. ఫీజు రాయితీపై డీఈఓ ఆదేశాలపై హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు బి. అరుణ్ కుమార్, జగదీష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ట్రెజరర్ రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.