Tuesday, May 21, 2024

కాంగ్రెస్‌ సునామీలో బీఆర్‌ఎస్‌ ఖల్లాస్‌..!

తప్పక చదవండి
  • రాష్ట్రంలో కొలువు తీరేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
  • అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ బహిరంగ చర్చకు సిద్ధమా
  • అభివృద్ధికి ఆమడదూరంగా మహేశ్వరం నియోజకవర్గం
  • ముఠాలను, రౌడీయిజం పెంచి పోషించిన బీఆర్‌ఎస్‌
  • బీసీ సాధికారత కాంగ్రెస్‌ తోనే సాధ్యం..
  • అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు శ్రీ రామరక్ష
  • మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

మహేశ్వరం : రాష్ట్రంలో అన్ని రంగాలలో విఫలం చెందిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనూహ్యమైన ప్రజల తీర్పుతో బంగాళాఖాతంలో కలవడం ఖాయమని, ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుతీరుతుందని మహేశ్వరం నియోజకవర్గ హస్తం పార్టీ అభ్యర్థి కిచెన్న గారి లక్ష్మారెడ్డి జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి విపరీతంగా వీస్తుందని, కాంగ్రెస్‌ సృష్టించే సునామీలో బీఆర్‌ఎస్‌, బీజేపీ లు ఖలాస్‌ అని నొక్కి వక్కానించారు. మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి జాడ కనిపించడం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, నియోజక వర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబితమ్మకు సవాల్‌ విసిరారు. అభివృద్ధి నెపంతో గెలిపించిన పార్టీని, ప్రజలను ఓడిరచి స్వలాభం కోసం మంత్రి పదవి కోసం కేసీఆర్‌ పంచన చేరిన సబితమ్మ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి అయి ఉండి నియోజకవర్గంలో విద్యకు విద్యార్థినీ, విద్యార్థులకు, యువతకు, మహిళలకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదని మండిపడ్డారు. తాను గెలిచిన పిదప అభివృద్ధి అంటే ఏమిటో రుచి చూపిస్తాను అని సవాల్‌ విసిరారు. అభివృద్ధిపై ప్రజా సమస్యలపై తాను గతంలోనే అసెంబ్లీలో గళం విప్పానని అన్నారు. బీసీ సాధికారత కాంగ్రెస్‌ తోనే సాధ్యమని బీసీలందరూ కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని అన్నారు. పారదర్శకతకు, పనితనానికి పెట్టింది పేరు కేఎల్‌ఆర్‌ అని, రాబోయే ప్రభుత్వ సహాయంతో నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, సదా ప్రజలలో ఉండే సాధారణ వ్యక్తినని సమాజ శ్రేయస్సుకై కేఎల్‌ఆర్‌ ట్రస్టుతో వివిధ రకాల బాధలతో కొట్టుమిట్టాడుతున్న అనేక కుటుంబాలకు అండగా నిలిచి అన్ని రకాల సేవలు అందిస్తున్నానని తెలిపారు. బారాస ప్రభుత్వం కోతల ప్రభుత్వంగా ఘనత సాధించిందని, అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల యువకుల బలవన్మరణానికి కారణమైన బీఆర్‌ఎస్‌ ను పాతాళానికి తొక్కాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలో నామమాత్రంగా కార్పొరేషన్‌, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయకుండా అభివృద్ధికి దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అవకాశాలు కల్పించకుండా కేవలం ముఠాలను రౌడీయిజాన్ని పెంచి పోషించింది బీఆర్‌ఎస్‌ అని, వచ్చే ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి, కారు గుర్తుకు బుద్ధి చెప్పాలని తెలియచెప్పారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లతో అన్ని వర్గాలను ఆదుకుని, రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు