Wednesday, May 22, 2024

నేషనల్‌ గేమ్స్‌ క్రీడా జ్యోతి ర్యాలీని ప్రారంభం

తప్పక చదవండి

పనాజి : జాతీయ క్రీడల క్రీడా జ్యోతి ర్యాలీని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రారంభించారు. గోవా రాజధాని పనాజీలో ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలకు 37వ జాతీయ క్రీడల గురించి తెలియబర్చడానికి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు సావంత్‌ చెప్పారు. ఈ క్రీడలు గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడలు మాత్రమే కావని, గోవా ప్రజలు, యువత నిర్వహిస్తున్న క్రీడలని ఆయన పేర్కొన్నారు.
జాతీయ క్రీడలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి దాదాపు 2.5 లక్షల మంది తరలివస్తారని గోవా సీఎం అంచనా వేశారు. ఈ నేషనల్‌ గేమ్స్‌ ద్వారా గోవాలో స్పోర్ట్స్‌ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. కాగా, గోవాలో అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 9 వరకు 37వ జాతీయ క్రీడలు జరుగనున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు