Monday, May 20, 2024

హారన్‌ కొడితే హత్యాయత్నం చేస్తారా : నారా లోకేశ్‌

తప్పక చదవండి

అమరావతి : వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌ రెడ్డి తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ వివేకను వేసేస్తే, ఆయన సైకో ఫ్యాన్స్‌ హారన్‌ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన అమరావతిలో విూడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా, కావలిలో రోడ్డుపై అడ్డంగా ఉన్న బైక్‌ తీయాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బీఆర్‌ సింగ్‌ హారన్‌ కొట్టడమే నేరమైందన్నారు. నడిరోడ్డుపై పట్టపగలు వైసీపీ నేతలు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సైకో జగన్‌ ఫ్యాక్షన్‌ ప్రదేశ్‌గా మారిపోయిందన్నారు. సైకో జగన్‌ పోతేనే, ఇలాంటి పిల్ల సైకో గ్యాంగులన్నీ పోతాయని, రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని లోకేష్‌ అన్నారు. నెల్లూరు జిల్లా, కావలిలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. రౌడీమూఖలు పెట్రేగిపోతున్నాయి. బైకు అడ్డంగా ఉండగా హారన్‌ మోగించారని ఆర్టీసీ డ్రైవర్లపై మూకుమ్మడిగా దాడి చేసి, హత్యాయత్నం చేశారు. జాతీయ రహాదారి నడిరోడ్డులో బస్సును కారుతో అడ్డగించి దాష్టీకం ప్రదర్శించారు. ఆర్డీసీ డ్రైవర్‌ బీఆర్‌ సింగ్‌ని రోడ్డుపై పడేసి కాళ్లతో తన్నతూ రౌడీలు రెచ్చిపోయారు. అడ్డొచ్చిన వారిని, వీడియోలు తీయబోయిన వారిపైనా దాడి చేసి.. చంపి పాతిపెడతామంటూ హెచ్చరించారు. ఎవరొస్తారంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఈ ఘటనలో దేవరకొండ సుధీర్‌తో పాటు పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల అరెస్టులో జాప్యం జరిగింది. దాడి దృశ్యాలు సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు