- తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కార్యక్రమంలో
పాల్గొన్న టి.జీ.ఓ. జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణా యాదవ్..
హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
శుక్రవారం రోజు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో అమరులైన విద్యార్థులకు జోహార్లు తెలియజేశారు టి.జి ఓ. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబి కృష్ణ యాదవ్.. ఈ కార్యక్రమంలో టీజీవో సిటీ బ్రాంచ్ అధ్యక్షుడు గండూరి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ రామారావు, భీమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు..