- సీటుకో రేట్ పెట్టిండు.. ఇప్పుడు సీట్లు అమ్ముకుంటుండు..
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి..
- ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుంది..
- ఆరు దశబ్దాలు పాలించినా ఏమీ చేయకుండా, మళ్ళీ ఆరు గ్యారెంటీలా..
- ప్రధాని మోడీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే..
- మాది మహాత్మా గాంధీ వారసత్వం
- మోడీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం..
- మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధికి 50వేల మెజార్టీతో గెలిపించాలి..
- ఐటి హబ్తో పాటు ఎస్టిపి, ఎఫ్ఎస్టిపి ప్లాంట్ ప్రారంభోత్సవంలో
మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి..
సూర్యాపేట : ఓటుకు నోటు దొంగ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడుపుతుండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సూర్యాపేటలో ఐటీ హబ్ తో పాటు 530 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు,ప్రారంభించిన అనంతరం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి విషయంలో మంత్రి జగదీష్ రెడ్డి రాజీలేని కృషి, నిత్యం18 గంటల ఆయన శ్రమతో మెట్రో నగరాన్ని తలపిస్తుందన్నారు .సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధికి 50వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు.సూర్యాపేట అభివృద్ధి కోసం నిధులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్న మంత్రి, పుల్లారెడ్డి చెరువు ఆధునికరణ, జమ్మిగడ్డ వరకు రహదారుల విస్తరణ కోసం 30 కోట్లు మంజూరు చేస్తునట్లు ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్, బిజెపి లపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగకు ఓటు వేద్దామా.? అని ప్రశ్నించారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చినా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మళ్లీ ఒకసారి చాన్స్ ఇవ్వండి అని అడుగడం కాంగ్రెస్ సిగ్గుమాలిన తనానికి నిదర్శనం అన్నారు. వారి పరిపాలనలో కాలిపోయే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు. ఎరువుల కొరత,విత్తనాలను పోలీసు స్టేషన్లో ఉంచి పంచిపెట్టిన దుస్థితి ఉండేదని ప్రజలకు గుర్తు చేశారు. అలాంటి వారికి ఓటేస్తే రాష్ట్రాన్ని దోచుకుంటారని అన్నారు.ఒక్కోసీటుకు ఒక్కో రేటు పెట్టి అమ్ముకుంటున్న నాయకుడు రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడో లేదో ఆలోచించండి అని అన్నారు.కేసీఆర్ నాయకత్వంలో 75 ఏండ్లలో ఎవరూ చేయని పనులు చేసుకున్నాం ,చేసుకుంటున్నాం అన్నారు. ఏ ప్రధాని, ఏ సీఎం ఆలోచన చేయని విధంగా రైతుబంధు కింద డబ్బులు జమ చేస్తున్నాం అన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు జమ చేశాం అన్న కేటీఆర్ ఇటువంటి పథకం దేశంలో మరి ఎక్కడా లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తూ వారి కుటుంబాల్లో కెసిఆర్ పెద్దకొడుకులా మారడని అన్నారు దళితబంధులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు మాట్లాడటం సరికాదని కేటీఆర్ అన్నారు. రోడ్ల మీద చెప్పులు కుట్టే 18 కుటుంబాలకు దళిత బంధు అమలు చేసి ఇచ్చారు జగదీశ్ రెడ్డి. మేం అడగకుండానే మాకు దళితబందు ఇచ్చారని లబ్దిదారులు అంటున్నారని మంత్రి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇలా పంపిణీ విషయంలో కూడా లబ్ధిదారుల ముందే డ్రా తీసి ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎంపిక చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మా ప్రజా ప్రతినిధుల నిజాయితీకి నిదర్శనం అన్నారు.2014కు ముందు కరెంట్ కష్టాలు రైతులను ముప్పు తిప్పలు పెట్టేవన్నారు.నాడు ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలు అయ్యాక స్నానాలకు బావుల వద్దకు పోతే కరెంట్ ఉండేది కాదని కేటీఆర్ గుర్తు చేశారు. బావుల కాడ స్నానం చేయలేని దుస్థితి ఉండేదన్న మంత్రి, ఏనాడూ మూడు గంటల కరెంట్ ఇవ్వలేదన్నారు. 24 గంటల కరెంట్ వస్తలేదని కోమటిరెడ్డి అనడం ఆయన తెలివి తక్కువ తనానికి నిదర్శనం అన్నారు.24 కరెంట్ వస్తే రాజీనామా చేస్తానని అంటున్న వెంకట్ రెడ్డి కి అనుమానం ఎక్కువ అన్నారు .మీరు, మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వస్తారో అక్కడికి రండి బస్సులు మేం పెడుతాం. ఖర్చు మాదే. సూర్యాపేట జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఏ గ్రామానికి పోతారో మాకు అభ్యంతరం లేదు. ఏ టైంకు పోతారో పోండి. అందరూ మంచిగా లైన్లో నిలబడి కరెంట్ తీగలను గట్టిగా పట్టుకోండి. కరెంటో వస్తుందో లేదో తెలిసిపోతది అని హెడ్డేవ చేశారు.దీంతో దేశానికి దరిద్య్రం కూడా పోతదన్నారు. తమ పాలనలో కరెంట్, మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థులు కాంగ్రెస్ నాయకులని పేర్కొన్నారు. సాగునీరు, కరెంట్, మంచినీరు ఇచ్చి కేసీఆర్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.తిన్నది అరగక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.సూర్యాపేటలో పోటీ చేస్తే ఎవరికి డిపాజిట్ దక్కుదో తెలుస్తుందన్న మంత్రి, దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.150 ఏండ్ల కింద పుట్టిన కాంగ్రెస్ పార్టీకి వారెంటీ లేకుండా పోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరిపోయే దీపం లాంటి దిక్కుమాలిన పార్టీ అని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 పెన్షన్ ఇవ్వలేనోడు.. ఇప్పుడు 4 వేల పెన్షన్ ఇస్తామంటే నమ్ముదామా..? నమ్మి ఆగం కావొద్దని, ఆరు దశాబ్దాల పాటు ఆగం చేసినోళ్లు ఆరు గ్యారెంటీలు అని డైలాగులు కొడితే నమ్మి మోసపోదామా.? అని అన్నారు.సూర్యాపేటలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేయలేని అభివృద్ధిని తొమ్మిది నెలలోనే మంత్రి జగదీశ్ రెడ్డి చేశారని అన్నారు. సూర్యాపేటలో కొత్త కొత్త షాపింగ్ మాల్స్, ప్రపంచ స్థాయి వ్యాపార సంస్థలు వస్తున్నాయంటే అది ఇక్కడ జరిగిన అభివృద్ధితోనే అన్నారు. సూర్యాపేటలో ఉన్న ప్రశాంత వాతావరణ ని ఇదేవిధంగా కొనసాగించడానికి , ఇంకా అభివృద్ధిలో ముందుకు వెళ్లేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ని సూర్యాపేట నియోజకవర్గం ప్రజలు 50వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగ యాదవ్, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదన కలెక్టర్లు వెంకట్ రెడ్డి, ప్రియాంక, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్పిడి శ్రీనివాస్ గౌడ్,శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ పి రామానుజుల రెడ్డి, ఆయా మండలాల, ఎంపీపీలు,జడ్పిటిసిలు, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.