Tuesday, May 14, 2024

ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలు..

తప్పక చదవండి
  • గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల పోస్టులకు రాత పరీక్షలు..
  • సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం..వచ్చేనెల 3 వరకు..
  • భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి సన్నాహాలు..

హైదరాబాద్ :
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియలు వడివడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగాలకు ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ వచ్చేవారంలో మరో కీలక పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు నియామక రాత పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి మొదలవ్వనున్నాయి. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్షలు వచ్చేనెల 3వ తేదీ వరకు జరగనున్నాయి. దాదాపు 1392 పోస్టులకు గానూ ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. 11 రోజులపాటు ఆయా తేదీల్లో 16 సబ్జెక్టుల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సెషన్‌లో సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్ష జరగుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష తేదీలను విడుదల చేసింది. కాగా తెలంగాణలో భారీ సంఖ్యలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు భర్తీ చేయడం ఇదే తొలిసారి. 2008లో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో (2008) 1100 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య కంటే అధికంగా 1392 పోస్టులను భర్తీ చేయడం విశేషం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు