స్టేషన్ ఘన్ పూర్ : ధర్మసాగర్ మండలం పరిధిలోని దేవనుర్ గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో స్థానిక ప్రజానీకానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలలో పెద్దపీట వేసినట్లే రానున్న రోజులలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాగానే సంక్షేమ పథకాలకు అమలు చేస్తామని గ్రామ ప్రజానీకానికి తెలియజేసిన స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర హైదరాబాద్లో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు గడపగడపకు తిరుగుతూ డేవనూర్ గ్రామ ప్రజలందరికీ గత ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు కూడా ఇదేవిధంగా మీ మీరు ఆశీర్వదించగలరని కోరుచున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగనే, సోనియమ్మ ప్రకటించిన 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు మండల నాయకులు మహిళా నాయకురాలు యువజన నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- మహాలక్ష్మి
మహిళలకు ప్రతి నెల రూ.2,500,
రూ.500 కే గ్యాస్ సిలిండర్,
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. - రైతు భరోసా
ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15,000,
వ్యవసాయ కూలీలకు రూ.12,000,
వరి పంటకు రూ.500 బోనస్.
3 గృహ జ్యోతి
ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. - ఇందిరమ్మ ఇండ్లు
ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & రూ.5 లక్షలు,
ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం. - యువ వికాసం
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు,
ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషన్ స్కూల్స్. - చేయూత
రూ.4,000 నెలవారీ పింఛను,
రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య భీమా.