- రైతులకు ఇచ్చిన హామీలన్ని ఉత్తివే
- సిఎం కెసిఆర్కు లేఖ రాసిన రేవంత్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ఇచ్చిన ఉచిత ఎరువుల హామీ గాలికి పోయిందన్నారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలలాగే మాట ఇచ్చి వదిలేశారన్నారు. కేసీఆర్ మాట ఇచ్చి నిలబడరని మరోసారి రుజువైందన్నారు. పైసలిచ్చి కొనుగోలు చేద్దామన్నా ఎరువులు దొరకడం లేదన్నారు. ఎరువుల కోసం రైతులు బారులు తీరారని రేవంత్ పేర్కొన్నారు. ఎరువుల కోసం రైతులు క్యూ లో చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం సొంత జిల్లా లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.యూరియా నిల్వలు పెట్టాలనే సోయి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఎరువులను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ కోరారు.
తప్పక చదవండి
-Advertisement-