Sunday, May 5, 2024

బీజేపీకి మాజీ ఎంపీ వివేక్ రాజీనామా..

తప్పక చదవండి
  • రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వివేక్

హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి స్వయంగా ఆయనను రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకెళ్లారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో రాహల్ గాంధీ వద్దకు వివేక్ కుటుంబ సమేతంగా వచ్చారు. రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ తన కుమారుడు వంశీతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. రాజీనామా లేఖ పంపిన కాసేపట్లోనే ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశమయ్యారు. ఆయనతో పాటు కుమారుడు వంశీ కూడా హైదరాబాద్‌ నోవాటెల్‌లో రాహుల్‌తో సమావేశమయ్యారు. రాహుల్ సమక్షంలో ఆయన, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక్… బీఆర్ఎస్‌ పార్టీపై వ్యతిరేకంగా పోరాడేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రేవంత్ సారథ్యంలో బీఆర్ఎస్‌ రాక్షసపాలనపై పోరాటం చేస్తామని అన్నారు. ఇక వివేక్ చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి, ఆయన కుమారుడు వంశీ పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఆ హామీతోనే వారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒకే చెప్పినట్లు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. ఇదే విషయమై రాహుల్‌తో భేటీ అనంతరం మీడియా వివేక్‌ను ప్రశ్నించగా.. తమకు సీట్లు, పదవులు ముఖ్యం కాదని బీఆర్ఎస్ కుటుంబ పాలన అంతం చేయటమే ముఖ్యమని అన్నారు.

పార్టీ మార్పుపై ఎప్పటి నుంచో ప్రచారం..
వివేక్ పార్టీ అంశంపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గతనెల ప్రధాని మోదీ పాల్గొన్న పాలమూరు బహిరంగ సభకు ఆయన డుమ్మా కొట్టడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీజేపీ.. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని భావించింది. అందులో భాగంగా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా వివేక్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అయినా ఆయన అసంతృప్తితోనే ఉన్నట్లు తెలిసింది. ఇక ఐదు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ సమయంలో పార్టీ మార్పుపై మీడియా ప్రశ్నించగా.. తాను బీజేపీలోనే ఉంటానని చెప్పారు. ఇంతలోనే బీజేపీకి రాజీనామా చేయటంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు