- బీజేపీ కండువా కప్పుకున్న చిత్తరంజన్ దాస్, కృష్ణా యాదవ్..
- కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ ఆధ్వర్యంలో చేరికలు..
హైదరాబాద్ : మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, కృష్ణాయాదవ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆగస్టు 30నే బీజేపీలో చేరేందుకు కృష్ణాయాదవ్ వచ్చారు. కానీ పార్టీలో చేర్చుకోకుండా కిషన్రెడ్డి తిప్పిపంపారు. ఎట్టకేలకు కృష్ణాయాదవ్ చేరికకు కిషన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కృష్ణాయాదవ్ అంబర్పేట బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే సిర్పూర్ కాగజ్నగర్ జడ్పీటీసీ రేఖా కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.