Tuesday, May 7, 2024

జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమ్మర్సన్‌ నంగాగ్వా..

తప్పక చదవండి
  • రెండసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక..
    ఎమ్మర్సన్‌ నంగాగ్వా వరుసగా రెండోసారి జింబాబ్వే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శనివారం వెల్లడైన ఫలితాల్లో మంగాగ్వా విజయం సాధించారు. అధికార పార్టీ జెడ్.ఏ.ఎన్.యూ-పీ.ఎఫ్. అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తినా ప్రజలు రెండోసారి కూడా అధికార పార్టీ అభ్యర్థినే గెలిపించారు. నంగాగ్వా తన సమీప ప్రత్యర్థి నెల్సన్‌ చామిసాపై విజయాన్ని నమోదు చేశారు. కాగా, 1980లో బ్రిటన్‌ నుంచి జింబాబ్వే స్వాతంత్య్రం పొందిన తర్వాత తొలిసారి నంగాగ్వా హయాంలోనే జెడ్.ఏ.ఎన్.యూ-పీ.ఎఫ్. పార్టీ బలోపేతమైంది. అంతేగాక మంగాగ్వా తొలిసారి పూర్తికాలం పదవిలో ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కాగా, జింబాబ్వే గత రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. నిత్యవసరాలు, అత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం పెరిపోయింది. అయినా అధికార పార్టీ గెలవడం విచిత్రంగా ఉందంటున్నారు విశ్లేషకులు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు