Sunday, May 19, 2024

సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు..

తప్పక చదవండి
  • వెల్లడించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణను అన్ని రంగాల్లో అబివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ పాలనను చూసి దేశ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన 200 మందికి పైగా మేకల అశోక్ రెడ్డి, బోయ నాగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కంచర్ల వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్బండ వర్ణాల కోసం ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారన్నారు. రైతులకు ఉచిత కరెంటు, రైతుబీమా రైతుబంధు, లక్ష రూపాయల రుణమాఫీతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో అందరూ అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారని, దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిందని, అందుకే ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు బకరం వెంకన్న, స్థానిక సర్పంచ్ మేకల రవీందర్ రెడ్డి, రంగారెడ్డి నగర్ సర్పంచ్ మామిళ్ల సైదులు, గ్రామ శాఖ అధ్యక్షుడు సాదిక్ వల్లి, ఎం లింగస్వామిలతో పాటు పార్టీ చేరిన వారిలో మేకల అశోక్ రెడ్డి, మామిడి బాబు, ఎదుళ్ల అమరేందర్ రెడ్డి, గంగుల వెంకన్న తిప్పర్తి నాగరాజు, మామిడి అండాలు మేడిగే యాదమ్మ మామిడి ఎల్లమ్మ ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు