- తెలంగాణలో ప్రతిశాఖపైనా శ్వేతపత్రం
- రైతుబంధు సకాలంలో అందచేస్తాం
- వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు
- మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
సిద్దిపేట (ఆదాబ్ హైదరాబాద్):విద్యుత్శాఖలో రూ.85 వేల కోట్లు అప్పు ఉందని, తెలంగాణలో ఉన్న ప్రతి శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలన నచ్చక కాంగ్రెస్కు ప్రజలు అవకాశం ఇచ్చారని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రిగా పొన్నం ప్రభాకర్ మొదటిసారిగా సిద్ధిపేటకు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పొన్నానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బిసి బంధుపై సవిూక్షించి ఆలోచన చేస్తామని, మూడు రాష్టాల్ల్రో గెలిచినా ఇప్పటికి బిజెపి సిఎంలను నియమించలేదని పొన్నం చురకలంటిం చారు. ఆర్టిసి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.అనేక బాధ్యతల ద్వారా ఎదిగానని.. ఎప్పటికీ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. మనముందు ఉన్న కర్తవ్యం పెద్దది అని.. గత పాలకుల తీరు నచ్చక కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారన్నారు. ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆచరణలో లోపాలను ప్రతి 15 రోజులకోసారి సవిూక్షించుకుని ముందుకు వెళతామన్నారు. రోజు 45 లక్షల మందిని, 35 లక్షల కిలోవిూటర్లు ఆర్టీసీ తిరుగుతుందని తెలిపారు. ఆర్టీసీని మరింత ప్రజలకు చేరువ చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యత తీసుకుంటానన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం మన భాద్యతగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. వంద రోజుల కాలంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా పని చేస్తామన్నారు. సమస్య ఉంటే పార్టీ ఏదైనా తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. నియంతృత్వం తమ విధానం కాదన్నారు. గూగుల్ మ్యాప్లు నీళ్ళల్లోకి తీసుకు పోతున్నాయని.. గూగుల్కు లెటర్ రాయాలని కలెక్టర్కు ఆదేశించానన్నారు. గౌరవెళ్లి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయమని చెప్పానన్నారు. బీసీ బందులో అవకతవకలపై సవిూక్ష జరుపతామన్నారు. విద్యుత్ శాఖకు మాత్రమే 85 వేల కోట్ల అప్పు ఉందని తెలుస్తోందన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు ఎప్పుడూ డిసెంబర్ చివరి వారంలో ఇచ్చిందని.. ఖచ్చితంగా రైతులకు రైతుబందు ఇస్తామన్నారు. ప్రతి శాఖకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ మనుగడ కోసం కృషి చేస్తామన్నారు. పార్టీ శ్రేణులు, పోటీ చేసిన అభ్యర్థుల ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతాయని.. వర్గాలకు, విభేదాలకు తావివ్వద్దని పొన్నం ప్రభాకర్ వెల్లడిరచారు.
సిద్దిపేట,11 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్):విద్యుత్శాఖలో రూ.85 వేల కోట్లు అప్పు ఉందని, తెలంగాణలో ఉన్న ప్రతి శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలన నచ్చక కాంగ్రెస్కు ప్రజలు అవకాశం ఇచ్చారని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రిగా పొన్నం ప్రభాకర్ మొదటిసారిగా సిద్ధిపేటకు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పొన్నానికి ఘన స్వాగతం