హైదరాబాద్: హైదరాబాద్లో ఈట్ రైట్ మిల్లెట్ వాకథాన్ ద్వారా ఆహారాన్ని వృథా చేయకుండా సురక్షితమైన, బలవర్థకమైన, ఆరోగ్యకరమైన ఆహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ, దక్షిణ ప్రాంతం హెర్బాలైఫ్తో కలిసి సన్నద్ధమైంది. ‘‘సురక్షితమైన, పోషకమైన ఆహా రాన్ని తినడం గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన ఈ పాన్-ఇండి యా చొరవలో భాగం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈట్ రైట్ చొరవను ప్రోత్స హిం చడానికి, ఆరోగ్యకరమైన జీవనం కోసం ఆరోగ్యకరమైన ఆహారం యొక్క ప్రాముఖ్య తను అర్థం చేసుకోవడంలో ప్రజలకు సహాయపడటానికి మేము ఎఫ్ఎస్ఎస్ఎఐతో భాగస్వామ్యం కుదు ర్చుకు న్నాము. స్వస్థ్ భారత్ మిషన్లో భాగంగా, దేశంలో పోషకాహార అంతరాలను పరిష్కరిం చడానికి సమగ్ర ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఎఫ్ ఎస్ ఎస్ ఏఐకి మద్దతు ఇస్తూనే ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా పౌరుల ఆహారపు అలవాట్లను మార్చ వచ్చు’ అని హెర్బాలైఫ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఖన్నా పేర్కొన్నారు