- ఎంపీ హోం మంత్రి నరోత్తం మిశ్రాపై వెల్లువెత్తుతున్న విమర్శలు..
భోపాల్ : మధ్యప్రదేశ్ హోంమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నరోత్తం మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. దతియాలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ హేమ మాలిన్ పేరు ప్రస్తావించడం ద్వారా మహిళను అవమానించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దతియాలో జరిగిన సభలో మంత్రి మిశ్రా మాట్లాడుతూ దతియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, హేమ మాలిని కూడా డ్యాన్స్ చేసే స్ధాయిలో అభివృద్ధి జరిగిందని అన్నారు. మిశ్రా ప్రకటనపై జేడీయూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా తన సొంత పార్టీ ఎంపీ హేమ మాలినీపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతల సిగ్గుమాలిన వ్యవహర శైలి బయటపడుతున్నదని పేర్కొంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నరోత్తం మిశ్రా నాలుగోసారి దతియా నుంచి పోటీ చేస్తున్నారు. మిశ్రా 2008, 2013, 2018లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ స్ధానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా సీనియర్ నేత రాజేంద్ర భారతి బరిలో నిలిచారు.