యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సతీసమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.