Wednesday, May 1, 2024

పేద ప్రజలకు అండగా బీఎస్పీ పార్టీ.

తప్పక చదవండి
  • ప్రచారాలు తప్ప పథకాలు రాని వైనం
  • ఇళ్ల పట్టాలు ఇస్తానని, ప్రకటనకే పరిమితమైన మంత్రి
  • 20 వార్డు కౌన్సిలర్ అన్నేపర్తి రాజేష్

సూర్యాపేట : బంగారు తెలంగాణ లో పేదలకు గూడు కరువైంది.గూడు లేని వారికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినా మంత్రి ఎండ్లు గడుస్తున్న ఇండ్లు ఇవ్వకుండా, మంత్రికి పలుమార్లు విన్నవించినా సహాయం చేయలేదు అని తెలిపారు.వార్డును అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో వార్డు ప్రజలు తనపై నమ్మకం వుంచి కౌన్సిలర్ గా గెలిపించారని, కాని ప్రజల సమస్యలు తెలియజేయడానికి తనకు మంత్రి జగదీష్ రెడ్డి అవకాశం కూడ ఇవ్వలేదని 20 వ వార్డు కౌన్సిలర్, బిఎస్పి నాయకులు అన్నెపర్తి రాజేష్ అన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు కూడ మంత్రిని కలవలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.తన వార్డులో ఇండ్లు లేని నిరుపేదలు 30 మంది వున్నారని, వారి పరిస్థితి దయనీయమైన స్థితిలో వుందని ఆయన అన్నారు.మరుగుదొడ్డి సౌకర్యం లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గురువారం జమ్మిగడ్డ లోని లంబాడి బజార్ లో కూలడానికి సిద్దంగా వున్న పెంకుటిల్లులో నివాసం వుంటున్న డోలి కుటుంబాన్ని పరామర్శించారు. జమ్మిగడ్డ లో 200 ఇండ్లకు పట్టాలు ఇవ్వలేదని, పలుమార్లు ప్రభుత్వం ద్ర్రష్టికి తీసుకుని వెళ్లామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు కుంభం నాగరాజు, కుంభం రాజేష్,వంశీ,నిహాల్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు