- సీఎంపై అనుచిత వాక్యాలు చేస్తే ఊరుకునేది లేదు
- ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
- ప్రజాపాలనలోని కార్యక్రమానికి అనూహ్య స్పందన
- టీపీసీసీ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ యుగంధర్
హైదరాబాద్ : సీఎంపై ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు అసత్యాలను పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని వాటిని చూస్తూ ఊరుకోబోమని టీపీసీసీ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ యుగంధర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ సీఎం పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని వాటిని ప్రజలు సహించరని మాజీ ప్రజాప్రతినిధి ఇప్పటికయిన గుర్తిస్తే మంచిదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలు అమలుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నేడు అడ్డగూడూర్ మండలం వెల్దెవి గ్రామంలో ప్రజలనుండి దరఖాస్తులు తీసుకుంటున్న ప్రక్రియను టీపీసీసీ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ యుగంధర్ పరిశీలించారు. ఆర్జీదారులతో యుగంధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు వాటి అమలుకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం అడ్డగూడూర్ తహసీల్దార్ తో మాట్లాడి ధరఖాస్తుల భద్రతా లబ్ధిదారుల ఎంపిక వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రోడ్డ మల్లేష్ బోడ యాదగిరి జక్కుల రామ్ యాదవ్,రాచకొండ సతీష్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.