వాషింగ్టన్ : టైటానిక్ సబ్మెరైన్కు విషాదానికి సంబంధించిన అన్వేషణలో యూఎస్ కోస్ట్గార్డ్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో చివరి అవశేషాన్ని స్వాధీనం చే సుకున్నామని వెల్లడిరచింది. టైటాన్ సబ్మెర్సిబుల్ నుండి మానవ అవశేషాలు భావిస్తున్న వాటితో పాటు, కొన్ని శిథిల భాగాలను సేకరించినట్టు తెలిపింది. అలాగే వీటిని వైద్య నిపుణుల విశ్లేషణ కోసం పంపింది. గత వారం వాటిని స్వాధీనం చేసుకుని యుఎస్ ఓడరేవుకు తరలించినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిధిలాల అన్వేషణకు వెళ్లి మార్గమధ్య లో సబ్మెరైన్ పేలిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటికే కొన్నింటిని సేకరిం చగా మిగిలిన శిధిలాల చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డ్ తాజాగా గుర్తించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఓషన్ ఆపరేటర్ అయిన ఓషన్ గేట్ అప్పటినుండి వ్యాపారాన్ని నిలిపివేసింది. ఈ ఏడాది జూన్ 18న ఉత్తర అట్లాంటిక్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు జరిగిన పేలుడులో మరణించిన వారిలో సబ్మెర్సిబుల్ పైలట్, కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ కూడా ఉన్నారు. మిగిలిన నలుగురు ప్రయాణికుల్లో బ్రిటిష్పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హవిూష్ హార్డింగ్, పాల్
హెన్రీ నార్గో లెట్, మాజీ ఫ్రెంచ్ నౌకాదళ డైవర్ ఉన్నారు.ఈ విషాదంపై ప్రపంచ వ్యాప్త విచారణ కొనసాగు తోంది. కాగా 1912లో టైటినిక్ షిప్ను మొదటిసారిగా ప్రవేశపెట్టినపుడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణనౌకగా పేరు గాంచింది. అయితే ఇంగ్లాండ్లోని సౌత్హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్కు బయలుదేరిన తొలి ప్రయాణంలోనే 1912 ఏప్రిల్ 14న ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. 1517 మంది ప్రజలు మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదంపై 1997లో హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ టైటానిక్ సినిమా తీశాడు.
తప్పక చదవండి
-Advertisement-