Thursday, May 2, 2024

తొలి వికెట్ కోల్పోయిన అఫ్ఘానిస్థాన్..

తప్పక చదవండి

వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా.. ఢిల్లీ వేదికగా నేడు భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొద‌ట‌ బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్‌కు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. అఫ్ఘానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(22)ను బుమ్రా ఔట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు. దీంతో అఫ్ఘానిస్థాన్ 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్ జట్టు 7.3 ఓవర్లకు 33 ప‌రుగులు చేసింది. క్రీజులో రహ్మానుల్లా గుర్బాజ్(10), రహమత్ షా(0) ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. ఇవాళ జరిగేది 9వ మ్యాచ్‌. ఆడిన రెండేసి మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్లు నాలుగేసి పాయింట్లతో పాయింట్స్‌ టేబుల్‌లో తొలి రెండు స్థానాలను ఆక్రమించాయి. భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ఒక్కో మ్యాచ్‌ గెలిచి రెండేసి పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ టీమ్‌లు ఒక్కో విజయం, ఒక్కో ఓటమితో రెండేసి పాయింట్లు సాధించి ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్‌ ఆడిన ఒక్కో మ్యాచ్‌ ఓడిపోయి.. బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఓడిపోయి ఇంకా ఖాతా తెరువలేదు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు