ఎందుకో నా ప్రకృతి మాత ఇట్ల చేస్తున్నది.
కాల సర్పమై కాటు వేసి మాకు
కన్నీళ్లు మిగులుస్తున్నది.
మొన్న సాయి చందన్న గానం..
నిన్న గద్దరన్న గానం..
ప్రజల గొంతు, ప్రజా గాయకుల గొంతులు,
కనపడకుండా పగబట్టి కొట్లమందిని
దుఃఖ సాగరంలో ముంచుతున్నది.
మచ్చ లేని మంచివాళ్ళను
అంత మాయం చేస్తున్నది …
- నరేష్ యాదవ్..